News March 20, 2024

కేంద్రమంత్రిపై ఈసీ ఆగ్రహం

image

కేంద్ర మంత్రి శోభ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా కర్ణాటక సీఈవోను ఆదేశించింది. కాగా రామేశ్వరం పేలుళ్ల వెనుక తమిళుల పాత్ర ఉందని శోభ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు తన వ్యాఖ్యలపై శోభ క్షమాపణలు చెప్పింది.

Similar News

News November 27, 2025

జనగామ: పంచాయతీ ఎన్నికలు.. నిఖిల ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ జిల్లాకి జనరల్ అబ్జర్వర్‌గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.