News May 10, 2024

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను ఆర్వోకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తే చాలని వెల్లడించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.

Similar News

News December 12, 2025

రాష్ట్రంలో మా ప్రభంజనం మొదలైంది: BRS

image

TG: తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘గులాబీ జెండా పల్లెల్లో దుమ్మురేపింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవలేకపోయింది. అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో మొదటి విడతలో మా పార్టీ 64% సీట్లు గెలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ 44% సీట్లే గెలిచింది’ అని పేర్కొంది.

News December 12, 2025

దువ్వాడ మాధురి, శ్రీనివాస్ అరెస్ట్?

image

AP MLC దువ్వాడ శ్రీనివాస్, మాధురిని HYD పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినట్లు సమాచారం. దీంతో పోలీసులు దాడులు నిర్వహించి భారీగా మద్యం బాటిళ్లు, మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

News December 12, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,910 పెరిగి రూ.1,32,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,750 ఎగబాకి రూ.1,21,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.6,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,15,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.