News May 10, 2024
పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ కీలక ఆదేశాలు

AP: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను ఆర్వోకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తే చాలని వెల్లడించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News December 22, 2025
జిల్లా పోలీస్ PGRSకు 85 ఫిర్యాదులు

జిల్లా పోలీసు ప్రాధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో SP సతీష్కుమార్ 85 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి పిటిషనర్ సమస్యను సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు పోలీసులపై నమ్మకం పెరిగేలా అర్జీల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు, వ్యక్తిగత, సామాజిక అంశాల ఫిర్యాదులను పరిశీలించామన్నారు.
News December 22, 2025
SC తీర్పు అంశాలతో CWCకి నివేదిక

TG: అనుమతుల్లేని ప్రాజెక్టులపై ఇటీవల SC రాష్ట్రానికి అనుకూల తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత తీర్పు అంశాలతో లీగల్ రిపోర్టును CWCకి సమర్పించాలని నిర్ణయించింది. పలుమార్లు తిరస్కరించిన ‘పాలమూరు-రంగారెడ్డి’ సహా ఇతర ప్రాజెక్టుల DPRలను ఆమోదించాలని కోరనుంది. వీటికి కృష్ణా జలాల కేటాయింపుపై ట్రైబ్యునల్ విచారణను కమిషన్కు నివేదించనుంది.
News December 22, 2025
తెలుగు కళల వైభవం చాటేలా ‘ఆవకాయ’ ఫెస్టివల్: కందుల

AP: తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరిట సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘AP వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా కళాకారులకు ఈ ఉత్సవం గొప్ప వేదికగా నిలుస్తుంది. అలాగే ఉగాదికి నంది అవార్డులు ఇస్తాం. నాటకోత్సవాలు నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.


