News May 10, 2024
పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ కీలక ఆదేశాలు

AP: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక జాబితాను ఆర్వోకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తే చాలని వెల్లడించింది. అయితే పోలింగ్ ఏజెంట్లను ఆయా పార్టీల అభ్యర్థులు ధ్రువీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో ఏజెంట్ల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News December 17, 2025
8,113పోస్టులు.. CBAT షెడ్యూల్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గతేడాది విడుదల చేసిన 8,113 <
News December 17, 2025
బుల్లెట్ రైలు ట్రాక్ కోసం Soil Test!

AP: బెంగళూరు-HYD, HYD-చెన్నై మార్గాల్లో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. HYD-చెన్నై మార్గం గుంటూరు జిల్లా.. బెంగళూరు-HYD మార్గం అనంతపురం జిల్లా మీదుగా వెళ్తుంది. ఇందులో భాగంగా నిన్న అనంతపురం(D) బుక్కరాయసముద్రం ఏరియాలో భూపరీక్షలు నిర్వహించింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు సిద్ధం చేస్తున్న గ్రౌండ్ రిపోర్టులో భాగంగానే భూపరీక్షలు చేసినట్లు తెలుస్తోంది.
News December 17, 2025
కౌలు రైతులకు రూ.లక్ష రుణం, ఎవరికి రాదు?

AP: ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి(DKT), అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు, సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.


