News April 19, 2024
షర్మిలకు ఈసీ నోటీసులు

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Similar News
News January 19, 2026
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.
News January 19, 2026
రబీ వరిలో పెరిగిన తెగుళ్లు – కట్టడికి కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం పెరిగిన చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి బాగా పెరిగింది. ప్రధానంగా వరిలో కాండం తొలిచే పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు, జింకు లోపం కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 19, 2026
మా కరెంట్తోనే భారత్లో AI సేవలు: US

భారత్లో AI సేవల కోసం అమెరికన్లు డబ్బులు చెల్లిస్తున్నారని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. USలోని కరెంట్తోనే చాట్జీపీటీ వంటి ప్లాట్ఫామ్లు పనిచేస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్, చైనా వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం, రష్యాతో సంబంధాలపై భారత్ టార్గెట్గా నవారో గతంలోనూ పలు విమర్శలు చేశారు.


