News April 5, 2024

ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఈసీ నోటీసులు

image

ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీజేపీపై చేసిన ఆరోపణలకు ఈనెల 8న మ.12 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని, పార్టీలో చేరకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆమెతో పాటు నలుగురు ఆప్ సీనియర్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 8, 2024

GATE-2025 గడువు పొడిగింపు

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్‌లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

News October 8, 2024

అవినీతి జగన్‌పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్

image

AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

News October 8, 2024

ఒమర్ అబ్దుల్లానే సీఎం: ఫరూక్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈనేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తదుపరి సీఎం అని ప్రకటించారు.