News April 5, 2024
ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఈసీ నోటీసులు

ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీజేపీపై చేసిన ఆరోపణలకు ఈనెల 8న మ.12 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని, పార్టీలో చేరకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్లు ఆమెతో పాటు నలుగురు ఆప్ సీనియర్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 10, 2026
స్పీకర్కు కాంగ్రెస్, BJP పోటాపోటీ లేఖలు!

ప్రతిపక్షాల నిరసనలతో ఊహించని పరిస్థితి ఎదురుకావచ్చని, <<19058377>>లోక్సభకు రావద్దని<<>> మోదీకి చెప్పానని స్పీకర్ ఓంబిర్లా వ్యాఖ్యానించడం తెలిసిందే. దీంతో తమ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా MPలు స్పీకర్కు లేఖ రాశారు. దీనికి కౌంటర్గా లెటర్ రాసిన BJP మహిళా MPలు.. ఆ రోజు గందరగోళం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ గౌరవాన్ని నిలబెట్టేందుకు సహనం ప్రదర్శించారని ఆయన్ను కొనియాడారు.
News February 10, 2026
గోర్లు విరిగిపోకుండా ఉండాలంటే?

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.
News February 10, 2026
రేపు సెలవు

TG: రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ రేపు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రేపు 7AM నుంచి 5PM వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయి.


