News April 4, 2024

మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

image

AP: చంద్రబాబే పింఛన్లు ఆపారంటూ మంత్రి జోగి రమేశ్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అలాగే వాలంటీర్ల సేవల నిలిపివేతకూ చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు చేసిన ట్వీట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో జోగి రమేశ్‌తో పాటు ఎమ్మెల్సీ, ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

Similar News

News February 6, 2026

ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

image

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్‌తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్‌లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!

News February 6, 2026

బెంగాల్ ఎన్నికలు.. ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్..!

image

వె.బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో 2 దశాబ్దాలుగా ఉన్న పొత్తు తెంచుకుని 2006 తర్వాత తొలిసారి ఒంటరిగా బరిలోకి దిగనుంది. 294 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో రాష్ట్ర నేతల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొత్తుల కారణంగానే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం లేదని హైకమాండ్‌కు తెలిపారు.

News February 6, 2026

ప్యూర్ సిల్వర్‌ను గుర్తించడం ఎలా?

image

* ప్యూర్ సిల్వర్ అయస్కాంతానికి అతుక్కోదు.
* ఐస్ ముక్క ఉంచితే వెంటనే కరగడం మొదలవుతుంది.
* వాసన ఉండదు. ఏదైనా లోహాన్ని కలిపినప్పుడు/పూత వేసినప్పుడు రాగి లేదా మెటల్ వాసన వస్తుంది.
* శుభ్రమైన తెల్లటి వస్త్రంతో వెండి వస్తువుపై రుద్దితే నలుపు/గ్రే మచ్చలు కనిపిస్తాయి.
* నీటిలో త్వరగా మునిగిపోతుంది. నకిలీ వెండి మెల్లగా నీటి అడుగుకు చేరుతుంది.
* మరో లోహంతో కొట్టినప్పుడు క్లియర్ బెల్ సౌండ్ వస్తుంది.