News May 11, 2024

ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

image

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.

Similar News

News December 19, 2025

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో భారీ జీతంతో ఉద్యోగాలు

image

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌(<>EIL<<>>) 22 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE, B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 2వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే AGMకు రూ.1లక్ష-రూ.2,60,000, Sr.మేనేజర్‌కు రూ.90,000-రూ.2,40,000, మేనేజర్‌కు రూ.80,000-రూ.2,20,000, dy.మేనేజర్‌కు రూ.70,000-రూ.2,000000 చెల్లిస్తారు.

News December 19, 2025

టాస్ గెలిచిన భారత్.. ఓవర్లు తగ్గింపు

image

దుబాయి వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న ఏసీసీ మెన్స్ U19 ఆసియా కప్ సెమీ ఫైనల్-1లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఒక్కో ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లకు కుదించారు.

IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్
LIVE: సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌

News December 19, 2025

నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు 3,488 ఎకరాలు: CBN

image

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నేషనల్ మెగాషిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని CM CBN కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను కోరారు. ‘దీనికి అవసరమైన 3,488 ఎకరాలు కేటాయిస్తాం. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వెంటనే అనుమతివ్వండి’ అని కోరారు. ఫేజ్1లో ₹1361.49 కోట్లతో 4 హార్బర్ల పనులు చేపట్టామని, వాటికి కేంద్రం నుంచి రావలసిన నిధులివ్వాలని విన్నవించారు.