News May 11, 2024

ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

image

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.

Similar News

News December 15, 2025

దేశానికి త్వరలో కొత్త ప్రధాని: పృథ్వీరాజ్

image

మహారాష్ట్ర మాజీ సీఎం, INC నేత పృథ్వీరాజ్ చవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి త్వరలో కొత్త PM రాబోతున్నారని జోస్యం చెప్పారు. ఆయన మరాఠీ వ్యక్తే కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల SMలో తాను చేసిన పోస్టుపై స్పందిస్తూ ‘ప్రపంచ స్థాయిలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మార్పులు జరగొచ్చు. బీజేపీ మహారాష్ట్ర నుంచి కొత్త వ్యక్తికి ప్రధానిగా అవకాశం ఇవ్వొచ్చు. నా ప్రకటన ఊహాజనితమే’ అని పేర్కొన్నారు.

News December 15, 2025

24 ఏళ్ల వయసులో రూ.2.50 కోట్ల టర్నోవర్

image

ఒక స్టార్టప్‌తో 10 వేల మంది రైతులకు అండగా నిలుస్తున్నారు బిహార్‌కు చెందిన 24 ఏళ్ల ప్రిన్స్ శుక్లా. రైతుల కష్టాలను చూసి చలించిన అతడు తండ్రి నుంచి రూ.లక్ష తీసుకొని ‘AGRATE’ సంస్థ స్థాపించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్, ఎరువులు, ఆధునిక శిక్షణ ఇస్తూ ఉత్పత్తులకు మంచి మార్కెట్ కల్పించడంతో వారి ఆదాయం పెరిగింది. ప్రస్తుతం AGRATE టర్నోవర్ రూ.2.5 కోట్లు. మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News December 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 97

image

ఈరోజు ప్రశ్న: ఈ ఆలయంలో కొలువైన అంజన్న స్వామికి రెండు ముఖాలు ఉంటాయి. అందులో ఒకటి హనుమంతుడిది కాగా, మరొకటి నరసింహస్వామిది. మూల విరాట్టు భుజాలపై శంఖుచక్రాలు, ఛాతి మీద సీతారాముని రూపాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది.
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>