News May 11, 2024
ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
Similar News
News December 11, 2025
రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్భవన్, అసెంబ్లీ దర్బార్ హాలు నిర్మాణానికి ఓకే చెప్పింది. గవర్నర్ ఆఫీస్, స్టాఫ్ క్వార్టర్స్, అతిథిగృహాల నిర్మాణానికి అంగీకారం లభించింది. 26 సంస్థలకు సంబంధించిన రూ.20 వేల కోట్ల పెట్టుబడులను క్యాబినెట్ ఆమోదించింది.
News December 11, 2025
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 11, 2025
స్వామివారి 18 మెట్లు.. దైవీక అస్త్రాల శక్తి

అయ్యప్ప స్వామి 18 మెట్లపై 18 అస్త్రాలను వదిలారని నమ్మకం. ఇరుముడి మోసిన భక్తులకే ఈ అస్త్రాల శక్తిని దాటి, దర్శనం పొందే భాగ్యాన్ని పొందుతారు. ఆ అస్త్రాల పేర్లు.. 1.శరం 2.క్షుద్రిక 3.ధూమ్రకం 4.కామోదకం 5.పాంచజన్యం 6.నాగాస్త్రం 7.హలాయుధం 8.వజ్రాయుధం 9.సుదర్శనం 10.దంతాయుధం 11.నఖాయుధం 12.వరుణాయుధం 13.వాయువ్యాస్త్రం 14.శార్ఘ్నాయుధం 15.బ్రహ్మాస్త్రం 16.పాశుపతాస్త్రం 17.శూలాయుధం 18.త్రిశూలం. <<-se>>#AyyappaMala<<>>


