News May 11, 2024
ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
Similar News
News December 22, 2025
నాపై 109 కేసులున్నాయి కాబట్టే..: సంజయ్

ప్రజల కోసం చేసిన పోరాటాల వల్ల తనపై 109 కేసులు పెట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో తెలిపారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఇన్ని కేసులున్నాయా? అని అమిత్ షాను అడిగారని గుర్తు చేశారు. ‘అందుకే సంజయ్ కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రి అయ్యారు’ అని షా బదులిచ్చారని పేర్కొన్నారు. వైద్యులు ఫార్మా కంపెనీలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వలలో పడి ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు.
News December 22, 2025
డిసెంబర్ 22: చరిత్రలో ఈ రోజు

✒ 1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (ఫొటోలో)
✒ 1899: ప్రముఖ వైద్యుడు శొంఠి దక్షిణామూర్తి జననం
✒ 1953: సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటు
✒ 2000: ఢిల్లీలోని ఎర్రకోటలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక పౌరుడిని హతమార్చారు
✒ 2015: నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ మరణం
✒ జాతీయ గణిత దినోత్సవం
News December 22, 2025
రికార్డు సృష్టించిన స్మృతి

టీమ్ ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన రికార్డు సృష్టించారు. మహిళల T20Iల్లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఏషియన్ ప్లేయర్గా నిలిచారు. 154 మ్యాచుల్లో 4,007 రన్స్ చేశారు. ఇందులో ఒక సెంచరీతో పాటు 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ 4,716 రన్స్తో తొలి స్థానంలో ఉన్నారు.


