News May 11, 2024
ఏపీలో పోలింగ్ టైమింగ్స్ విడుదల చేసిన ఈసీ

ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఆ సమయంలోగా క్యూలైన్లో నిల్చున్న వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తారు.
Similar News
News March 19, 2026
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
News March 19, 2026
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరం ప్రతి ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఉగాది కొత్త ఆశలు, లక్ష్యాలకు శ్రీకారమని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూ, ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.
News March 19, 2026
రాయితీ పథకాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2025-26 సంవత్సరానికి మంజూరైన రాయితీ పథకాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈవీ వాహనాలు, వ్యవసాయ పరికరాలపై 60 నుంచి 90 శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపారు. అర్హులు ఈ నెల 24లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికలో మహిళలు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సంబంధిత పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.


