News March 19, 2024
24 గంటల వ్యవధిలోనే డీజీపీని మార్చిన ఈసీ
ఈసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న రాజీవ్ కుమార్ స్థానంలో వివేక్ సహాయ్ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. ఈసీ నిర్ణయం కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News September 30, 2024
CM చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు
AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలు, బుడమేరు, కొల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం, గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు.
News September 30, 2024
ఇంగ్లండ్ రికార్డును బద్దలుగొట్టిన భారత్
టెస్టుల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్లలోనే 90 సిక్సులు కొట్టి చరిత్ర లిఖించింది. బంగ్లాతో 2వ టెస్టులో ఈ ఫీట్ సాధించి, 2022లో ఇంగ్లండ్ (29 ఇన్నింగ్స్లలో 89 సిక్సులు) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మరిన్ని టెస్టు మ్యాచులున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది.
News September 30, 2024
గుడ్న్యూస్ చెప్పిన TGSRTC
TG: దసరా, బతుకమ్మ పండుగల రద్దీ దృష్ట్యా 6వేల స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ఈ బస్సులు నడుపుతున్నామంది. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో MGBS, JBS, LB నగర్, ఉప్పల్, ఆరాంఘర్, KPHB నుంచి సర్వీసులు ఉంటాయంది. విజయవాడ, బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు సమయాభావం తగ్గించేలా గచ్చిబౌలి ORR మీదుగా బస్సులు తిప్పుతామంది.