News March 31, 2024

మెడికల్ కాలేజీల్లో 5,819 పోస్టుల భర్తీకి ఈసీ అనుమతి

image

TG: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,819 ఉద్యోగాల భర్తీకి ఈసీ అనుమతి ఇచ్చింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్సుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలని స్పష్టం చేశారు.

Similar News

News October 6, 2024

హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ

image

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 6, 2024

తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత

image

డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

News October 6, 2024

నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.