News September 30, 2024
ఆర్థిక సంక్షోభం.. పాక్లో 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.
Similar News
News October 22, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్లో 29, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.
News October 22, 2025
పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News October 22, 2025
స్మృతి ఇరానీ సీరియల్లో బిల్గేట్స్

హిందీ టీవీ సీరియల్ ‘క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ’లో లీడ్ రోల్లో బీజేపీ మాజీ ఎంపీ స్మృతి ఇరానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ప్రెగ్నెంట్ ఉమెన్, నవజాత శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా స్మృతి, గేట్స్ మధ్య వీడియో కాల్ కాన్వర్జేషన్ ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తైందని, 3 ఎపిసోడ్స్లో ఆయన కనిపిస్తారని తెలిసింది.