News September 30, 2024

ఆర్థిక సంక్షోభం.. పాక్‌లో 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు

image

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో IMF నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేసి, మరో రెండు శాఖలను విలీనం చేయనుంది. దీంతో పాక్‌కు 7 బిలియన్ డాలర్లు లోన్ ఇచ్చేందుకు IMF సిద్ధమైంది. తొలి విడతగా 1బిలియన్ డాలర్లను రిలీజ్ చేసింది.

Similar News

News November 27, 2025

ప్లాన్ చేసి సీ సెక్షన్ చేయించుకుంటున్నారా?

image

సహజ ప్రసవం ద్వారా పుట్టిన వారితో పోలిస్తే సీ సెక్షన్‌‌తో పుట్టిన పిల్లలు లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకులు వెల్లడించారు. అలాగే నార్మల్ డెలివరీ సమయంలో బిడ్డపై కొన్ని రకాల బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్‌ సమస్యలు రావని మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.

News November 27, 2025

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 85,900 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు వృద్ధి చెంది 26,281 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. L&T, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికల్స్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, మారుతీ, TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News November 27, 2025

శబరిమల యాత్రికుల విశ్రాంతి ప్రదేశం

image

శబరిమలకు వెళ్లే యాత్రికులు బస చేసే ప్రాంతమే ‘శిరియాన వట్టం’. ఒకప్పుడు ఇక్కడ ఏనుగుల సంచారం అధికంగా ఉండేది. కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో వాటి రాక తగ్గింది. ఈ ప్రాంతం శబరిమల యాత్రికులకు ముఖ్యమైన విడిది కేంద్రంగా మారింది. తమ కఠినమైన ప్రయాణంలో అలసిపోయిన భక్తులు ఇక్కడి నుంచి పంబ నది వరకు తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుంటారు. వంటలు చేసుకొని భుజించి, విశ్రమిస్తుంటారు. <<-se>>#AyyappaMala<<>>