News November 14, 2024

DMK బిగ్గెస్ట్ డోనర్‌పై ED దాడులు.. WHAT NEXT?

image

తమిళనాడులో యాక్టర్ విజయ్ జోసెఫ్ కొత్త పార్టీతో అధికార DMKకు ఇప్పటికే తలనొప్పి ఎదురైనట్టు విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి బిగ్గెస్ట్ ఫండ్ డోనర్, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌ ఆస్తులపై ఈడీ నేడు దాడులు చేపట్టడం సంచలనంగా మారింది. DMKకు వచ్చిన 90% ఎలక్టోరల్ బాండ్లను ఆయనే కొన్నారు. గతేడాది దాడుల్లోనే రూ.450 కోట్ల ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసిన ED ఈసారి ఏం చేస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

Similar News

News December 9, 2025

పేరెంట్స్‌కు పిల్లలకు మధ్య న్యూరో సింక్రోని

image

తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఉండే న్యూరో సింక్రోని వల్లే పిల్లల్లో భాష, జీవన నైపుణ్యాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భావోద్వేగ నియంత్రణకు, ప్రేమ, అనుబంధాల ప్రేరణకు న్యూరో సింక్రోని కీ రోల్ పోషిస్తుంది. అలాగే అమ్మ మాట, పాట వంటివి పిల్లలల్లో నాణ్యమైన నిద్రకు కారణం అవుతాయి. పేరెంట్స్ కారణంగా తాను సురక్షితంగా ఉన్నాను అనే భావనను న్యూరో సింక్రోని పెంపొందిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

News December 9, 2025

ముగిసిన ‘అఖండ-2’ వివాదం!

image

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న రాత్రి ఈరోస్ సంస్థతో 14 రీల్స్‌కు సానుకూల చర్చలు జరిగాయని తెలిపాయి. ఇవాళ కోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి విడుదలకు అనుమతులు తీసుకుంటుందని వెల్లడించాయి. ఈ క్రమంలో 12న విడుదల, 11న ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇవాళ ఉ.10.30కు మద్రాస్ కోర్టులో విచారణ జరగనుంది.

News December 9, 2025

రేపు ఉద్యోగులతో పవన్ మాటామంతీ

image

AP: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ రేపు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. మంగళగిరిలోని ఓ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలను ఆయన వారికి వివరిస్తారు. అలాగే ఎలాంటి విధానాలు పాటిస్తే గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమో తెలుసుకోనున్నారు. అవినీతిరహిత పాలనను అందించేందుకు సహకరించాలని కోరనున్నారు.