News June 21, 2024
కేజ్రీవాల్ కేసులో EDది పక్షపాత వైఖరి: ఢిల్లీ కోర్టు

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్పై ED పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నియాయ్ బిందు అన్నారు. నిన్న కేజ్రీవాల్కు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్లో పలు విషయాలు వెల్లడించారు. కేజ్రీవాల్ లేదా అతడి ప్రతినిధి విజయ్ నాయర్ నేరుగా అవినీతి పాల్పడ్డట్లు ED ఆధారాలు సమర్పించలేకపోయిందన్నారు. ఇదిలా ఉంటే ఆయనకు మంజూరైన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


