News April 2, 2024
మహువా మొయిత్రాపై ఈడీ కేసు

టీఎంసీ నేత మహువా మొయిత్రాపై ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందానీ కోసం పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని.. ఇందుకుగానూ ఆమె ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారిస్తోంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా మహువా కృష్ణానగర్ నుంచి MPగా పోటీ చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
కాసేపట్లో భారత్కు వాన్స్

US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఉ.9.30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో ల్యాండ్ కానున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్లతో కలిసి 4 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. ఢిల్లీ అక్షర్ధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్ను సందర్శించాక సా.6.30 గంటలకు PM మోదీతో భేటీ అవుతారు. ధ్వైపాక్షిక చర్చల అనంతరం వాన్స్ దంపతులకు మోదీ విందు ఇస్తారు. ఇవాళ రాత్రికి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.
News April 21, 2025
నాని సినిమాల్లో ‘HIT 3’ రికార్డు

నేచురల్ స్టార్ నాని నటించిన ‘HIT-3’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే USAలో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటివరకు $75K వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుండగా, 10 రోజుల ముందే ఈ ఫీట్ను సాధించింది. దీంతో నాని కెరీర్లో అత్యంత వేగంగా $75K మార్కును చేరుకున్న సినిమాగా నిలిచింది. అలాగే ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రికార్డునూ సాధించనుంది.
News April 21, 2025
భారీగా తగ్గిన ధర.. KG రూ.15

TG: మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గిపోయాయి. HYD మలక్పేట్ మార్కెట్లో క్వింటాల్ ₹1200 ఉండగా, కనిష్ఠంగా ₹500 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో గత నెలలో కిలో ₹40 వరకు ఉన్న ధర ఇప్పుడు ₹15కు పడిపోయింది. యాసంగి దిగుబడి మరింతగా పెరగడంతో ఈ నెలాఖరుకు మరింత ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు తమకు ఆదాయం లేక నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతంలో ధర ఎంత ఉంది?