News May 14, 2024
TDP నేత జేసీ ప్రభాకర్రెడ్డిపై ED ఛార్జ్షీట్

మనీలాండరింగ్ కేసులో టీడీపీ సీనియర్ లీడర్ జేసీ ప్రభాకర్రెడ్డిపై ED ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 17 మందిపై ప్రాసిక్యూషన్ కంప్లైట్ ఫైల్ చేసింది. కాగా.. జేసీ.ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు చెందిన వాహనాలకు నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో 2022లో జేసీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Similar News
News March 13, 2026
ఫ్లాష్ ఫ్లడ్స్ను 24hrs ముందే అంచనా వేయొచ్చు: పిచాయ్

పట్టణాల్లో ఆకస్మిక వరదలను 24hrs ముందే అంచనా వేసే ‘గ్రౌండ్ సోర్స్’ అనే కొత్త AI మోడల్ను రూపొందించినట్లు గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటించారు. ‘జెమినీ’ సాయంతో ఇది 150+ దేశాల్లో 26లక్షల వరద సంఘటనలను విశ్లేషించిందని తెలిపారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, ప్రజల సేఫ్టీ కోసం ఈ డేటాను గూగుల్ <
News March 13, 2026
సీక్వెల్ సినిమాకి డైరెక్టర్గా బోయపాటి?

‘అఖండ-2’ తర్వాత బోయపాటి శ్రీను చేసే తర్వాత సినిమా ఏంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. సన్నీ డియోల్తో ‘జాట్-2’ డైరెక్ట్ చేయమని ఆయన్ను మైత్రీ సంస్థ సంప్రదించినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఇందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘జాట్’కు ఇది సీక్వెల్గా రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆఫర్ను తీసుకుంటారా? వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News March 13, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 13)

1899: హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జననం (ఫొటోలో)
1901: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్ మరణం
1926: తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్రరావు జననం
1940: జలియన్ వాలాబాగ్ కారకుడు మైఖేల్ డయ్యర్ను ఉద్దమ్ సింగ్ లండన్లో హతమార్చాడు


