News May 20, 2024

కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరిన ED

image

లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ మే 10న మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన జుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది.

Similar News

News January 28, 2026

నేడు వైజాగ్‌లో 4th టీ20.. జట్టులో మార్పులు?

image

భారత్, న్యూజిలాండ్ మధ్య 4th T20 మ్యాచ్ నేడు వైజాగ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను IND ఇప్పటికే 3-0తో కైవసం చేసుకోవడంతో ఈ మ్యాచులో ప్రయోగాలు చేయొచ్చు. హార్దిక్, హర్షిత్‌కు రెస్ట్ ఇచ్చి అక్షర్, అర్ష్‌దీప్‌ను ఆడించే అవకాశముంది. తొలి 3 మ్యాచుల్లో ఫెయిలైన శాంసన్ ఈరోజు రాణిస్తారా? శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.
LIVE: 7PM నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో.

News January 28, 2026

మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

image

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.

News January 28, 2026

కలుపు తీయనివాడు కోత కోయడు

image

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.