News January 27, 2025

ముడా స్కామ్‌లో ముఖ్యమంత్రి భార్యకు ఈడీ నోటీసులు

image

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) భూముల స్కామ్ దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ CM సిద్దరామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేశ్‌కు నోటీసులు జారీ చేసింది. ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య దంపతులతో పాటు సీఎం బావమరిది బీఎం మల్లికార్జున స్వామి ఇందులో నిందితులుగా ఉన్నారు.

Similar News

News February 5, 2026

సకల విద్యల ఆదిగురువు ‘శివుడు’

image

ఈ జగత్తు శివమయం. ఆయన తన డమరుకనాథంతో భాషకు మూలమైన 14 మహేశ్వర సూత్రాలను సృష్టించాడు. అందుకే ఆయన ఆద్యంతరహితుడు. యోగ విద్యను జగత్తుకు అందించి, సప్తస్వరాలతో సంగీతానికి, తాండవంతో నృత్యానికి ప్రాణం పోశారు. అర్ధనారీశ్వర తత్వంతో స్త్రీ గౌరవాన్ని, నిరాడంబర జీవనంతో ఆధ్యాత్మికతను చాటిచెప్పారు. కులగోత్రాల భేదం లేని శివగోత్రంతో సామాజిక సమరసతను బోధించిన ఆయన సగుణ నిర్గుణ తత్వానికి ప్రతీకగా నిలిచిన విశ్వగురువు.

News February 5, 2026

చిన్నపిల్లలకు కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే?

image

ప్రస్తుత కాలంలో చిన్నవయసులోనే ఎన్నో రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో కూడా ఈ మధ్య కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తిస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు నీరు ఎక్కువగా తాగడంతో పాటు హైసోడియం ఉన్న ఫుడ్స్ తినకుండా చూడాలి. అలాగే పిల్లలు ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫ్యామిలీలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News February 5, 2026

RAC ప్యాసింజర్ల నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు కరెక్ట్ కాదు: కమిటీ

image

RAC టికెట్‌‌పై ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయడం కరెక్ట్ కాదని పార్లమెంటరీ కమిటీ చెప్పింది. భారతీయ రైల్వేలలో సమయపాలన, ప్రయాణ సమయం, ఆపరేషన్లపై ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఛార్ట్ ప్రిపరేషన్ తర్వాత RACలో ఉండి, ఫుల్ బెర్త్ కేటాయించని ప్యాసింజర్లకు కొంత రిఫండ్ ఇచ్చే మెకానిజం తేవాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సూచించింది. ఒకే బెర్త్‌కు ఇద్దరి నుంచి ఫుల్ ఛార్జ్ వసూలు చేయకూడదని తెలిపింది.