News January 27, 2025
ముడా స్కామ్లో ముఖ్యమంత్రి భార్యకు ఈడీ నోటీసులు

మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) భూముల స్కామ్ దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ CM సిద్దరామయ్య భార్య పార్వతికి, మంత్రి సురేశ్కు నోటీసులు జారీ చేసింది. ముడా భూముల కేటాయింపులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత అక్టోబరులో ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య దంపతులతో పాటు సీఎం బావమరిది బీఎం మల్లికార్జున స్వామి ఇందులో నిందితులుగా ఉన్నారు.
Similar News
News March 3, 2026
మా రియాక్షన్ ఏంటో త్వరలోనే తెలుస్తుంది: ట్రంప్

రియాద్లోని US ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో <<19285091>>దాడి<<>> చేయడాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘మా ఎంబసీపై దాడికి, మా సైనికుల మరణానికి అమెరికా ఇచ్చే సమాధానం ఏంటో మీకు త్వరలోనే తెలుస్తుంది’ అని హెచ్చరించారు. అయితే ఇరాన్లోకి నేరుగా సైన్యాన్ని పంపాల్సిన అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్లలో ఆ దేశానికి ఇప్పటికే భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
News March 3, 2026
ఆముదం పంట రెండో గెల దశలో ఉందా?

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంట రెండో గెల దశలో ఉంటే నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వేసవిలో రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఈ పంటలో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో ఎండు తెగులు గమనిస్తే లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను కలిపి మొక్క మొదళ్లు తడిచేలా పిచికారీ చేయాలి.
News March 3, 2026
NCC అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఆర్మీలో 76పోస్టులు..

ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 124వ కోర్సు కోసం 76 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసై, NCC C సర్టిఫికెట్లో B గ్రేడ్ ఉన్నవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 19 – 25 ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: www.joinindianarmy.nic.in


