News January 4, 2025
విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఓ సారి ఈడీ నోటీసులు ఇవ్వగా, అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆయన హాజరుకాలేదు. తాజా నోటీసుల నేపథ్యంలో VSR విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్రాజ్ను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
News December 28, 2025
సాగు కోసం వర్షపు నీటిని కాపాడుకుందాం

వ్యవసాయానికి వాన నీరే కీలకం. ఈ నీటిని పరిరక్షించి, భూగర్భ జలాలను పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం వర్షపు నీరు నేలలో ఇంకేలా వాలుకు అడ్డంగా కాలువలు, కందకాలు తీసి నీరు వృథాగా పోకుండా చూడాలి. నీటి గుంటలు, చెక్డ్యామ్స్, ఫామ్పాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భజలాలను పెంచవచ్చు. బీడు భూముల్లో చెట్ల పెంపకం, సామాజిక అడవుల పెంపకం చేపట్టాలి. దీని వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు నేలకోత తగ్గి భూసారం పెరుగుతుంది.
News December 28, 2025
CCMBలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

హైదరాబాద్లోని <


