News January 4, 2025
విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

AP: కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఓ సారి ఈడీ నోటీసులు ఇవ్వగా, అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో ఆయన హాజరుకాలేదు. తాజా నోటీసుల నేపథ్యంలో VSR విచారణకు హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. కాకినాడ పోర్టులో కేవీ రావు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News December 21, 2025
రేవంత్ పేరు ఎత్తని KCR

తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ఒక్కసారి కూడా సీఎం రేవంత్ పేరును ప్రస్తావించలేదు. దాదాపు గంటా 15 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి రెండేళ్లు పూర్తయినా కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం, అధికార పార్టీ అని మాత్రమే సంబోధిస్తున్నారు. తాజాగా ఇదే కంటిన్యూ చేశారు. అటు కూతురు కవిత పేరు కూడా ప్రస్తావనకు రాలేదు.
News December 21, 2025
షాకింగ్.. బిగ్బాస్ విన్నర్ ప్రకటన!

తెలుగు బిగ్బాస్ సీజన్-9 విజేత ఎవరనే విషయమై ఉత్కంఠ నెలకొంది. మరికాసేపట్లో విన్నర్ ఎవరో తెలియనుండగా ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా ముందే విజేతను చెప్పేసింది. ఈ సీజన్ విన్నర్ కళ్యాణ్ అని పేర్కొంది. కాగా వికీపీడియాలో ఎవరైనా మార్పులు(ఎడిట్) చేసే అవకాశముంది. దీంతో కొందరు కావాలనే వ్యూయర్స్ను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బిగ్బాస్ టీమ్తో ఎలాంటి సంబంధాలు ఉండవు.
News December 21, 2025
సీఎం జిల్లా నుంచే మాజీ సీఎం పోరుబాట

TG: రెండేళ్ల తర్వాత యాక్టివ్గా కనిపిస్తున్న కేసీఆర్ కృష్ణా జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచే పోరాటం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో అక్కడి నేతలతో సమావేశమవ్వడమే కాకుండా సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అటు నదీజలాల విషయంలో కేంద్రంలోని బీజేపీపైనా ఫైట్ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హామీలకు జనం టెంప్ట్ అయి ఓటేశారని, ఈ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.


