News March 27, 2024
నామినేషన్ వేసిన MP అభ్యర్థికి ED సమన్లు

శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీకి సంబంధించి కాంట్రాక్టుల అప్పగింతలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా.. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అతణ్ని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపించినట్లు శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.
Similar News
News March 19, 2026
పరాభవ నామ సంవత్సరం.. శుభ ముహూర్తాలు

* చైత్ర మాసం- మార్చి 27, 28
* వైశాఖ మాసం- ఏప్రిల్ 26, 29, మే 1, 3, 6-11
* నిజ జ్యేష్ఠ మాసం: జూన్ 17-జులై9
* శ్రావణ మాసం: ఆగస్టు 15, 16, 20, 22
* కార్తీక మాసం: నవంబర్ 12-22,
* మాఘ మాసం: 2027 ఫిబ్రవరి 7-27
* ఫాల్గుణ మాసం: మార్చి 10-ఏప్రిల్ 2
* గురు మౌఢ్యమి: జులై 15- ఆగస్టు 15, శుక్ర మౌఢ్యమి: అక్టోబర్ 19-29 వరకు ముహూర్తాలు లేవు.#ShareIt
News March 19, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.
News March 19, 2026
వారికి ఉచితంగా బిందు సేద్య పరికరాలు

APలోని 8 జిల్లాల్లో FRA(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) పట్టాదారులకు 100% రాయితీపై బిందు, 90% రాయితీతో తుంపర సేద్యం పరికరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అల్లూరి, ఏలూరు, మన్యం, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 2.30 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.


