News May 13, 2024
జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆందోళన

ఎన్నికలను కవర్ చేస్తోన్న జర్నలిస్టుల భద్రతపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. వారికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీంతోపాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించాలని గిల్డ్ అన్ని రాజకీయ పార్టీలు, కార్యకర్తలను కోరింది.
Similar News
News March 28, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 28, 2026
బర్గర్ కంపెనీ బంపర్ గిఫ్ట్: ఉద్యోగులకు ₹15 కోట్ల బోనస్!

USకు చెందిన ప్రముఖ బర్గర్ చైన్ ‘ఫైవ్ గాయ్స్’ తన ఉద్యోగులకు సుమారు ₹15 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా Feb 17న ఇచ్చిన ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ల రద్దీ వల్ల స్టాక్ అయిపోవడం, ఆన్లైన్ సిస్టమ్స్ నిలిచిపోవడం వంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అయినా కమిటెడ్గా వర్క్ చేసిన 1,500 మంది ఉద్యోగులకు CEO జెర్రీ ముర్రెల్ ఈ నగదు బహుమతి అందించారు.
News March 28, 2026
కొత్త రోల్తో IPLలోకి అశ్విన్ ఎంట్రీ

IPL 2026లో అశ్విన్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఫస్ట్ టైమ్ ఆయన జియోస్టార్ ప్యానెల్ తరపున కామెంటేటర్ మైక్ పట్టుకోనున్నారు. అద్భుతమైన అనాలసిస్ సామర్థ్యం ఉన్న అశ్విన్ మ్యాచ్ తీరును వివరించడంలో తనదైన ముద్ర వేయనున్నారు. ఈ ప్యానెల్లో సెహ్వాగ్, డివిలియర్స్, రైనా వంటి వాళ్లతో కలిసి సందడి చేస్తారు. గ్రౌండ్లో స్పిన్ మ్యాజిక్ చేసిన అశ్విన్ ఇప్పుడు తన మాటలతో క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనున్నారు.


