News April 4, 2024
నన్ను అవమానించడమే ఈడీ లక్ష్యం: కేజ్రీవాల్

తనను అవమానించడమే లక్ష్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ED తనను అరెస్ట్ చేసిందని CM కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆయన.. ఈ కేసులో తనకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఢిల్లీ హైకోర్టుకు విన్నవించారు. ఎన్నికలకు ముందు ఈ అరెస్టు చేయడంపై కేజ్రీవాల్ తరఫు లాయర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. కాగా ఇదే కేసులో మరో ఆప్ నేత సంజయ్సింగ్ జైలు నుంచి విడుదలయ్యారు.
Similar News
News February 4, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

<
News February 4, 2026
జట్లు వేరైనా మూలాలు మనవే!

FEB 7న మొదలుకానున్న T20 WCలో దాదాపు 35+ భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. USA సారథి మోనాంక్ పటేల్, కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా, ఒమన్ సారథి జతీందర్ సింగ్లతో పాటు USA పేసర్ సౌరభ్ వంటి ప్లేయర్స్ విదేశీ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు. మరోవైపు భారత్-అమెరికా జట్ల మధ్య పోరును నెటిజన్లు ‘పాస్పోర్ట్ VS గ్రీన్ కార్డ్’ మ్యాచ్ అని సరదాగా జోకులు పేలుస్తున్నారు.
News February 4, 2026
భార్య అందంగా ఉందని గుండు గీశాడు

కర్ణాటలోని బాగల్కోట(D)లో అమానవీయ ఘటన జరిగింది. అందంగా ఉన్న తన భార్యను ఇతర పురుషులు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడుగ్గా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా తాగి భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.


