News April 8, 2025
ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
Similar News
News February 8, 2026
కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.
News February 8, 2026
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు!

టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)పై ₹3.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అత్యధికంగా కర్వ్పై ₹3.80 లక్షలు-₹3.30 లక్షల దాకా తగ్గించింది. హారియర్-₹1.5 లక్షలు, పంచ్-₹1.6 లక్షలు, టియాగో-₹1.5 లక్షలు, నెక్సాన్పై ₹1.2 లక్షలు డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్ వేరియంట్స్ను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.
News February 8, 2026
రాజాసాబ్ OTT: మారుతిని రఫ్పాడిస్తున్నారు!

రెబల్ ఫ్యాన్స్ మరోసారి డైరెక్టర్ మారుతిని ఆడుకుంటున్నారు. OTTలో రాజాసాబ్ స్ట్రీమ్ అవుతుండటంతో, అందులోని తప్పులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమాలో చాలాచోట్ల ప్రభాస్ డూప్ను వాడారని తెలిసిపోయిందని స్క్రీన్ షాట్స్తో ట్రోల్ జరుగుతోంది. బస్ జర్నీలో హీరోకు గడ్డం ఉండి, దిగేసరికి ట్రిమ్ అయిందని, బస్సే మారిందని, ఆస్తి పొందిన కనకరాజు(సంజయ్దత్) ఎందుకు పారిపోవాలనే ప్రశ్నలతో రఫ్పాడిస్తున్నారు.


