News April 8, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

AP: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.

Similar News

News February 3, 2026

TTDకి నెయ్యి సరఫరా నిబంధనలు మార్చి అక్రమాలు: పయ్యావుల

image

AP: TTD నెయ్యి కల్తీ జరిగేలా గత బోర్డులో నిబంధనలు మార్చారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ‘డెయిరీలకు 3 ఏళ్లు ఏడాదికి 4L లీటర్ల పాల సేకరణ, ₹250 CR టర్నోవర్ ఉండాలని TDP హయాంలోని బోర్డు నిబంధన పెట్టింది. YCP హయాంలోని బోర్డు టర్నోవర్‌ను రూ.150 కోట్లకు కుదించింది. పాల సేకరణతో సంబంధం లేకుండా చేసింది’ అని పేర్కొన్నారు. నెయ్యిలో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో ఉన్నట్లు 2022 AUGలోనే CFTRI పేర్కొందని చెప్పారు.

News February 3, 2026

రూ.20,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు దోబూచులాడుతున్నాయి. <<19036694>>ఇవాళ ఉదయం<<>> రూ.20వేలు తగ్గి రూ.2.8లక్షలకు చేరుకున్న కేజీ సిల్వర్ ధర సాయంత్రానికి రూ.20వేలు పెరిగింది. దీంతో యథాతథంగా రూ.3 లక్షలకు చేరింది. కాగా కొన్ని వారాలుగా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ధరలు గత 4 రోజుల్లోనే రూ.1.25 లక్షలు తగ్గిన విషయం తెలిసిందే. అటు <<19038369>>బంగారం<<>> ధరల్లోనూ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

News February 3, 2026

Trade Deal: ఇండియాలో కామన్ మ్యాన్‌కు ఏంటి?

image

USతో ట్రేడ్ డీల్ వల్ల భారత్‌లో సామాన్యుల జీవితాలపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎగుమతులు పెరగడం వల్ల టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, జెమ్స్-జువెలరీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చమురు, గ్యాస్ దిగుమతులు చౌకగా మారితే ఇంధన ధరలు తగ్గొచ్చు. రూపాయి బలపడి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుతాయి. వ్యవసాయ రంగంపై క్లారిటీ రావాల్సి ఉంది.