News April 8, 2025
ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్సెట్ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.
Similar News
News February 2, 2026
KTRది నియంతృత్వ, రాచరికపు పోకడ: కవిత

TG: KCRను విచారణకు పిలవడమే నేరమన్నట్లు KTR మాట్లాడుతున్నారని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘అభ్యర్థి చెడ్డోడైనా KCRను చూసి ఓటేయాలని మీరు కోరడమేమిటి? అది మీ రాచరికపు, నియంతృత్వపు పోకడకు నిదర్శనం. ఈ వైఖరి మారనంతవరకూ BRSను ఎవరూ కాపాడలేరు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి జాగృతి తరఫున మంచి అభ్యర్థులను పెడుతున్నాం. ఆదుకొనే వారినే ప్రజలు ఎన్నుకోవాలి. FEB 20 తర్వాత ‘జనం బాట’ చేపడతాం’ అని కవిత తెలిపారు.
News February 2, 2026
ధురంధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాహుల్ గాంధీ.. అసలు విషయం ఇదీ

ధురంధర్ విషయంలో ఒక క్రేజీ న్యూస్ SMను ఊపేస్తోంది. సినిమా క్రెడిట్స్లో ‘ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాహుల్ గాంధీ’ అని కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సినిమా రంగంలోకి వచ్చారా? అంటూ పోస్టులతో రచ్చ చేస్తున్నారు. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత కాదు. బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్, లక్కీ భాస్కర్ వంటి హిట్స్ వెనకున్న సీనియర్ ప్రొడ్యూసర్. పేరు కలవడంతో వచ్చిన గందరగోళం అంతే!
News February 2, 2026
నిన్న ఢమాల్.. నేడు కమాల్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 943 పాయింట్ల లాభంతో 81,666కు చేరగా నిఫ్టీ 262 పాయింట్లు ఎగిసి మళ్లీ 25వేల మార్క్కు చేరుకుంది. నిన్నటి సెషన్లో భారీ అమ్మకాలు జరగగా ఈరోజు కొనుగోళ్లు నమోదయ్యాయి. ముడి చమురు ధరలు తగ్గడం, బడ్జెట్లో డేటా సెంటర్లకు పన్ను మినహాయింపు వంటి ప్రకటనలు, రూపీ కోలుకోవడం మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 30లో పవర్గ్రిడ్ 7.55% లాభంతో టాప్ గెయినర్గా ఉంది.


