News April 8, 2025

ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

image

AP: ఏపీ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. బీఈడీ, ప్రత్యేక బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తారు. అభ్యర్థులు వచ్చే నెల 14లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ కన్వీనర్ స్వామి తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న పరీక్ష జరగనుంది. ఫీజు వివరాలు: ఓసీ-రూ.650, బీసీ-రూ.500, ఎస్సీ, ఎస్టీ-రూ.450.

Similar News

News February 3, 2026

పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

image

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని YCP ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అటు తమ పార్టీ నేతలపై జరిగిన దాడుల గురించి వివరించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి కోరామని, NHRCకి ఫిర్యాదు చేస్తామని YV సుబ్బారెడ్డి తెలిపారు.

News February 3, 2026

నాని-సుజిత్ మూవీ అప్డేట్!

image

హీరో నాని టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్‌తో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు నెట్టింట వార్తలొస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే కనిపించనున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ లో నటిస్తున్నారు.

News February 3, 2026

ఏడాది తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

image

దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. BJP ఎమ్మెల్యేలు ఇవాళ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది. తొలుత ఇద్దరే అనుకున్న సీఎం రేసులో ఇప్పుడు ఆరుగురు ఉన్నారు. మాజీ సీఎం బీరేన్ సింగ్ రాజీనామాతో ఖాళీ అయిన పీఠానికి సత్యబ్రత సింగ్, విశ్వజిత్ సింగ్ సహా ఆరుగురు పోటీలో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.