News February 4, 2025

EEMT మెరిట్ టెస్ట్ ఫలితాల ప్రకటన

image

EEMT – 2025 ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 94 మంది 7,10 తరగతుల విద్యార్థులకు రూ 5,03,000లక్షల నగదు బహుమతులను ఈ నెల 28న పంపిణీ  చేయనున్నారు. అద్దంకికి సంస్థ కన్వీనర్ పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

పిల్లల్లో పోషకాహార లోపం రాకుండా ఉండాలంటే?

image

పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూ, ఎత్తుకు తగ్గ బరువు పెరగాలంటే పోషకాహారం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మొదటి ఆరునెలలు తల్లిపాలు, తర్వాత రెండేళ్ల వరకు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్​తో కూడిని పోషకాహారం అందిస్తే ఇమ్యునిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయోడిన్, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలంటున్నారు. వీటితో పాటు సమయానుసారం టీకాలు వేయించడం తప్పనిసరి.

News December 3, 2025

మెదక్: తండ్రీకొడుకుల మధ్య సర్పంచ్ పోటీ

image

రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రీకొడుకులు పోటీ పడుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రామానికి చెందిన మానెగళ్ళ రామకృష్ణయ్య, ఆయన కొడుకు వెంకటేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలో మొత్తం 10 వార్డులు, 1563 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌కి తండ్రి కొడుకు పోటీ చేయడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

News December 3, 2025

నల్గొండ: తెలుగు అక్షర క్రమంలోనే గుర్తులు!

image

జిల్లాలో మ.3 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. వెంటనే వారికి గుర్తులను కేటాయిస్తారు. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల పేర్లలో తెలుగు అక్షర క్రమంలో గుర్తుల కేటాయింపు ఉండనుంది. నామినేషన్లలో పేర్లు ఎలా రాశారో అలాగే తెలుగు అక్షరాల క్రమాన్ని గుర్తిస్తారు. కొందరు తమ ఇంటి పేరును ముందుగా,మరికొందరు చివరగా రాస్తారు.