News October 22, 2024
తుఫాన్ ప్రభావం.. పలు రైళ్లు రద్దు
AP: తుఫాన్ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 23న 18, 24న 37, 25న 11 రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దయ్యాయి.
Similar News
News October 22, 2024
BREAKING: ఫలితాలు విడుదల
TG: రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్టును TGPSC వెబ్సైట్లో పొందుపర్చారు. 1,392 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇప్పటికే పూర్తి కాగా, తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.
News October 22, 2024
PHOTO: ఒళ్లు గగుర్పొడిచే ఘటన
ఇరుకైన ప్రదేశం/గుహలో ఇరుక్కుపోతేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఇరుకైన బండరాళ్ల సందులో తలకిందులుగా ఉండిపోతే? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా? తాజాగా ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్కు వెళ్లిన యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రెండు బండరాళ్ల మధ్య పడిన ఫోన్ను తీసుకునే ప్రయత్నంలో ఇరుక్కుపోయింది. ఆమె ఫ్రెండ్ వెంటనే రెస్క్యూ బృందాలకు సమాచారం అందించగా 7 గంటల శ్రమ తర్వాత బయటికి తీసుకొచ్చారు.
News October 22, 2024
BSNL కొత్త లోగో.. మరిన్ని సేవలు ప్రారంభం
ప్రైవేటు టెలికం సంస్థల టారిఫ్ల పెంపుతో అనూహ్యంగా పుంజుకున్న BSNL వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త బ్రాండ్ లోగోతో Connecting Bharat – Securely, Affordably, and Reliably నినాదంతో ముందుకొచ్చింది. కొత్త లోగోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. అలాగే స్పామ్ ఫ్రీ నెట్వర్క్, Wi-Fi రోమింగ్, డైరెక్ట్ టు డివైజ్ కనెక్టివిటీ సేవల్ని ప్రారంభించింది.