News December 16, 2024

రేపు లోక్‌స‌భ‌లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు

image

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన‌ బిల్లును కేంద్రం మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ప‌లు రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మైన నేప‌థ్యంలో న్యాయ శాఖ రూపొందించిన ముసాయిదా బిల్లును ఇటీవ‌ల కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విష‌యం తెలిసిందే. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల బ‌లం అవ‌స‌రం. తదుప‌రి లోక్‌స‌భ‌లో దీనిపై జ‌ర‌గ‌నున్న చ‌ర్చ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Similar News

News October 20, 2025

త్వరలో వారికి ప్రత్యేక పింఛన్లు: మంత్రి కందుల

image

AP: రాష్ట్రంలోకి కళాకారులందరికీ త్వరలోనే ప్రత్యేక పింఛన్లను తిరిగి అందిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. గత ప్రభుత్వం కళాకారుల పింఛన్లను సాధారణ పింఛన్లకు జత చేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని దుయ్యబట్టారు. త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించి ఉగాది, కళారత్న పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని ఓ ప్రారంభ కార్యక్రమంలో చెప్పారు.

News October 20, 2025

దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

image

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.

News October 20, 2025

దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

image

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.