News May 11, 2024
నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.
Similar News
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.
News November 18, 2025
‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.


