News September 19, 2024
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. టీడీపీలో పోటీ
AP: రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో TDP అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు స్థానానికి ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమ, తాళ్ల వెంకటేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆలపాటికే సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇక ఉభయగోదావరి జిల్లాల స్థానానికి కేఎస్ జవహర్, బొడ్డు వెంకట రమణ, పేరాబత్తుల రాజశేఖర్, మంతెన రామరాజు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 19, 2024
కొత్త రేషన్ కార్డులపై గుడ్న్యూస్
TG: అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను CM ఆదేశించారు.
News September 19, 2024
మూడు జిల్లాలకు YCP అధ్యక్షుల నియామకం
AP: మరో మూడు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించింది. శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం-శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా తమ్మినేని సీతారాంను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
News September 19, 2024
సీఎం సహాయనిధికి సింగరేణి విరాళం
TG: వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయనిధికి సింగరేణి సంస్థ భారీ విరాళం అందించింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సింగరేణి ఎండీ బలరాం, ఎమ్మెల్యే, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో రూ.10.25 కోట్ల చెక్కులను అందించారు. దీంతో సింగరేణి ఉద్యోగులను సీఎం రేవంత్ అభినందించారు.