News May 25, 2024

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు: కేఏ పాల్

image

AP: దేశంలో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితులు చూడలేదన్నారు. ఈవీఎంలు పగలగొడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా విశాఖలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని చెప్పారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కూడా సెక్యూరిటీపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Similar News

News November 24, 2025

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

image

బ్యాంకు ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <>పోర్టల్‌లో<<>> లాగిన్ అయి తెలుసుకోవచ్చు. ఖాతాదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల పేరు, PAN, DOB వంటి వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే వారి వారసులు డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్, KYC డాక్యుమెంట్లతో బ్యాంకును సంప్రదించాలి. DEC 31లోగా క్లెయిమ్ చేసుకోని నగదును డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(DEAF) ఖాతాకు బదిలీ చేస్తారు.

News November 24, 2025

రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్

image

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.

News November 24, 2025

సందీప్ వంగా డైరెక్షన్ టీమ్‌లో స్టార్ కిడ్స్

image

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.