News March 17, 2024

ఎలక్షన్ అప్డేట్స్: కడప జిల్లాలో అప్పుడు ఇప్పుడు వాళ్లే

image

2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్‌ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

Similar News

News January 31, 2026

కడప జిల్లాలో మూడు ఆలయాలకు ఈవోల నియామకం

image

కడప జిల్లాలోని 3 ప్రధాన దేవాలయాలకు కొత్త ఈవోలను నియమిస్తూ శనివారం ప్రభుత్వం జారీ చేసింది. గండి ఆంజనేయస్వామి ఆలయానికి కర్నూలు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్‌ను నియమించారు. ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి కేవీ రమణ, ప్రొద్దుటూరు శ్రీకృష్ణ గీతాశ్రమానికి శ్రీధర్‌ను నియమించారు. ఈ మూడు ఆలయాలకు ఈవోగా ఉన్న వెంకటసుబ్బయ్య శనివారం పదవీ విరమణ చేస్తున్నారు.

News January 31, 2026

కలసపాడు: పంచాయతీ కార్యదర్శి గ్రూప్-2కు ఎంపిక

image

కలసపాడు మండలంలో పలు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన లక్ష్మీ సృజన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యారు. కలసపాడు మండలంలోని పలు పంచాయతీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సృజన పనితీరు, మంచితనం ప్రజలను గౌరవించడం ఆమె కృషికి ఈ ఎంపిక సంతోషకరమని పలువురు ప్రజలు అభినందించారు.

News January 30, 2026

కడప: అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం.!

image

కడప జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని DMAC ఛైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశామని, మొదటి సమావేశంలో 569కి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.