News May 2, 2024
ELECTION’S: ఆదిలా’బాద్ షా ఎవరు..?

రాష్ట్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది ఆదిలాబాద్ జిల్లా. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉండడంతో విభిన్న తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 లక్షల 44 ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్, BRS, BJP పోటీ చేయగా, ముగ్గురు టీచర్లే. ఈ తరుణంలో ఆదిలాబాద్ ఓటర్లు ఎవరిని గెలిపిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో అడుగుపెట్టేది ఎవరో కామెంట్ చేయండి.
Similar News
News March 29, 2026
లోక్ అదాలత్లో 5,399 కేసులు పరిష్కారం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. మొత్తం 5,399 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందులో 3,812 డ్రంక్ అండ్ డ్రైవ్, 1,017 ఈ-పెట్టీ కేసులు ఉన్నాయి. సైబర్ బాధితులకు రూ.9.95 లక్షలు వాపసు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News March 29, 2026
ADB: ఏప్రిల్ 1 నుంచి పదో తరగతి పత్రాల మూల్యాంకనం

జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 – 9 వరకు నిర్వహించనున్నట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకోసం 614 మంది ఉపాధ్యాయులను కేటాయించినట్లు పేర్కొన్నారు. వీరిలో 466 మంది చీఫ్ ఎగ్జామినర్లు (CE), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (AE) ఉండగా, 148 మందిని స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు వెల్లడించారు.
News March 29, 2026
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్పై కీలక ప్రకటన

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ విమానాశ్రయంపై కీలక ప్రకటన చేశారు. ఉడాన్ 2.0 పథకం కింద ఉన్న ఎయిర్స్ట్రిప్లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్స్ట్రిప్ను కాకుండా, మిగిలిన భూమిని సేకరించి అక్కడ విమానాశ్రయం నిర్మిస్తామని స్పష్టం చేశారు.


