News October 4, 2025
ఈ గ్రామాల్లో ఎన్నికలు బంద్!

TG: రాష్ట్రంలోని పలు చోట్ల సుప్రీంకోర్టు కేసుల కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడనుంది. వివిధ జిల్లాల్లో మొత్తం 14 MPTC స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డులు ఎన్నికలకు దూరం కానున్నాయి. ములుగు(D) మంగపేట(M)లో 14 MPTCలు, 25 సర్పంచ్లు, 230 వార్డులకు 15 ఏళ్ల నుంచి ట్రైబల్, నాన్ ట్రైబల్ పంచాయితీ వల్ల ఎన్నికలు జరగడం లేదు. KNRలో 2, మంచిర్యాలలోని గూడెం ఈసారి కూడా ఎలక్షన్స్కు దూరం కానున్నాయి.
Similar News
News October 4, 2025
ఈ-క్రాప్ ఎలా నమోదు చేస్తారు? ఎందుకు ముఖ్యం?

AP: ఈ-క్రాప్ నమోదులో భాగంగా వ్యవసాయ సిబ్బంది.. రైతు ఆధార్, ఫోన్ నంబర్, సర్వే నంబర్తో పాటు పొలం వద్ద రైతుల ఫొటోలు తీసి ఈ-పంట యాప్లో అప్లోడ్ చేస్తారు. పొలం గట్ల మీద సాగు చేసే పంటలు, చెట్లను కూడా ఈ క్రాపింగ్ చేస్తారు. పంట నమోదు చేశాక e-KYC చేస్తారు. ఇది పూర్తైన వారికే పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే ఈ-క్రాప్లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది.
News October 4, 2025
ఈ-క్రాప్ నమోదుకు ఈ నెల 25 తుది గడువు

APలో ఖరీఫ్ పంటలకు ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 25లోగా పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు, సిబ్బందికి.. ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు సూచించారు. నమోదులో భాగంగా సవరణలు, సామాజిక తనిఖీ, ఇతర మార్పులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని, 31న తుది జాబితా విడుదల చేయాలని అధికారులను ఢిల్లీరావు ఆదేశించారు. ఈ క్రాప్ నమోదుకు SEP-30ని చివరి తేదీగా ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. తాజాగా ఆ గడువును పెంచింది.
News October 4, 2025
ఆయన కన్నెర్ర చేస్తే కష్టాలే!

జ్యోతిష శాస్త్రం ప్రకారం.. శని దేవుడు కర్మలకు అధిపతి. మన జీవితంలోని ప్రతి క్రియకు తగిన కర్మ ఫలితాలను ఆయనే నిర్ణయిస్తారు. వాటిని సక్రమంగా అమలు చేస్తారు. అందుకే శని భగవాన్కి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం సుఖశాంతులతో ఉంటామని పండితులు చెబుతున్నారు. ఆయన కన్నెర్ర చేస్తే మాత్రం కర్మలకనుగుణంగా కష్టాలు పడాల్సిందేనని అంటున్నారు. ఆయన కరుణ కోసం ధర్మంగా ఉండటం, సత్కర్మలు చేయడం ముఖ్యం.