News October 7, 2025
ఎన్నికలు పక్కా.. అయితే ప్లాన్ ‘A’, లేదంటే ‘B’C

TG: ఏదేమైనా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని CM రేవంత్ స్పష్టం చేశారు. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో రేపు విచారణ జరగనుండగా న్యాయ నిపుణులు, మంత్రులు, ముఖ్య నేతలతో CM సమావేశమయ్యారు. తమ నిర్ణయ ఉద్దేశం, గత తీర్పులను కోర్టుకు వివరించాలని లాయర్లకు సూచించారు. G.O.ను తోసిపుచ్చితే ఆదేశాలు పాటిస్తామని HCకి విన్నవించాలన్నారు. ఇలా అయితే పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో (Plan:B) ఎన్నికలకు వెళ్దామని తెలిపారు.
Similar News
News October 8, 2025
రేపే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

TGలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు రేపు తెర పడనుంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ తరఫున ఈ హామీని నెరవేరుస్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
News October 8, 2025
మోహన్బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

AP: సినీ నటుడు మోహన్బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.
News October 7, 2025
హిమాచల్ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.