News March 16, 2024
ఎన్నికలు.. రాష్ట్రాలకు EC ఆదేశాలు

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు EC కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలి. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్గా ఎంపిక చేయాలి. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలి. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి’ అని సూచించింది.
Similar News
News February 9, 2026
మున్సిపోల్: సాయంకాలానికి అంతా SILENT

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం 5గంటలకు తెరపడనుంది. అధికార పార్టీ నుంచి సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, BJP నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, BRS నుంచి కేటీఆర్, హరీశ్ రావు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. చివరి రోజు కావడంతో ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. మొత్తం 2,982 వార్డులకు 11న పోలింగ్ జరగనుండగా 13 కౌంటింగ్ నిర్వహించనున్నారు.
News February 9, 2026
పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పూజా ద్రవ్యాలను గౌరవించాలి. అందులో ఉపయోగించే గంట, శంఖం, తమలపాకులతో పాటు ఏ వస్తువులనూ నేరుగా నేలపై ఉంచకూడదు. వీటిని పీఠంపై లేదా ఓ పళ్లెంలో ఉంచాలి. అలాగే, భగవంతునికి సమర్పించే పువ్వుల రెక్కలను విడదీసి పూజించడం నిషిద్ధం. పువ్వును వికసించిన రూపంలోనే అర్పించాలి. పూజా సమయంలో శక్తివంచన ఉండకూడదు. ఎడమ చేతిని అస్సలు ఉపయోగించకూడదు. కేవలం కుడిచేతితోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.
News February 9, 2026
క్యారెట్తో ఎన్ని ప్రయోజనాలో?

క్యారెట్ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటిచూపును, విటమిన్-C రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చి, విటమిన్-K ఎముకలను ధృడంగా చేస్తుంది. వీటిని పచ్చిగా, ఉడికించి లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.


