News March 18, 2024
రాష్ట్రంలో 4వ ఫేజ్లో ఎన్నికలు.. సీఈఓ రియాక్షన్ ఇదే..

TS: రాష్ట్రంలో 2019లో లోక్సభ ఎన్నికలు మొదటి ఫేజ్లోనే నిర్వహించగా.. ఈ సారి 4వ ఫేజ్కు మార్చడంపై రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘమే దీనిపై సమీక్షించి, నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో వారే డిసైడ్ చేశారని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
వాస్తు ప్లాన్లలో ఉత్తర దిశ ప్రాధాన్యత

వాస్తుశాస్త్రంలో తూర్పు దిశకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఇంటి లేఅవుట్లలో ఉత్తర దిశనే ప్రామాణికంగా గుర్తిస్తారు. దీనికి ప్రధాన కారణం ఉత్తర దిశ నుంచి నిరంతరం ప్రవహించే అయస్కాంత తరంగాలేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘పంచభూతాల సమన్వయానికి ఈ దిశ దిక్సూచిలా పనిచేస్తుంది. వినాయక వృత్తాంతంలోనూ ఉత్తర దిశ విశిష్టత గురించి ఉంది. అందుకే ప్లాన్లలో దిశల స్పష్టత కోసం ఉత్తరాన్ని వాడుతారు. <<-se>>#Vasthu<<>>
News December 19, 2025
టాప్10 ట్వీట్స్లో 8 మోదీ చేసినవే..

గడిచిన 30 రోజుల్లో ఇండియాలో అత్యధిక లైక్లు పొందిన టాప్ 10 ట్వీట్స్లో 8 ప్రధాని మోదీ చేసినవేనని ఎక్స్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు మోదీ భగవద్గీత అందిస్తున్న పోస్ట్కు 74వేల మంది లైక్ కొట్టారు. భారత్లో అత్యధిక లైక్స్ పొందిన ట్వీట్ల లిస్ట్లో మోదీ తప్ప మరో పొలిటీషియన్ లేరు. ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’లో అత్యధిక మంది ఫాలో (105.9M) అవుతున్న 4వ వ్యక్తిగా మోదీ రికార్డులకెక్కారు.
News December 19, 2025
విజయవాడ కృష్ణానదిలో హౌస్ బోట్లు!

AP: పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేరళ స్టైల్ లగ్జరీ హౌస్ బోట్లను విజయవాడ కృష్ణానదిలో తిప్పాలని యోచిస్తోంది. వీటిలో ఏసీ, లగ్జరీ బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్ రూమ్, డైనింగ్ స్పేస్ ఉంటాయి. పర్యాటకుల సేఫ్టీ కోసం లైఫ్ జాకెట్లతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తొలి విడతలో 20 హౌస్ బోట్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. రాత్రంతా ఉండేందుకు స్పెషల్ ప్యాకేజీలు ఉండనున్నాయి.


