News April 21, 2024
మాల్దీవుల్లో ఎలక్షన్స్.. అధికార పక్షానికి అగ్నిపరీక్ష!

మాల్దీవుల్లో 93 స్థానాలకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. 6 పార్టీల నుంచి 368 మంది పోటీలో ఉన్నారు. ఫలితాలు రేపు రానుండగా, ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు పార్టీ ‘పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్’కు షాక్ తగిలే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముయిజ్జు చేపట్టిన భారత వ్యతిరేక చర్యల నేపథ్యంలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ రావొచ్చని అంటున్నారు.
Similar News
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు-2026

>కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు: ధర్మపురి, భీంగల్, పెద్దపల్లి (D) సుల్తానాబాద్, మంథని. కరీంనగర్ (D) చొప్పదండి. మహబూబాబాద్ (D) మరిపెడ, డోర్నకల్. భద్రాద్రి (D) అశ్వారావుపేట, ఇల్లెందు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద. ఎల్లారెడ్డి, బాన్సువాడ. సూర్యాపేట (D) హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ.
>BRS గెలిచిన స్థానాలు: అయిజ, తొర్రూరు, తిరుమలగిరి. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం.
News February 13, 2026
తల్లిపాల గురించి ఈ విషయాలు తెలుసా?

తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు.. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలకి పాలివ్వడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయంటున్నారు నిపుణులు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిపాలు శిశువుకు సులువుగా అరగడంతో పాటు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. కాబట్టి తల్లిపాలివ్వడం ముఖ్యమని చెబుతున్నారు.
News February 13, 2026
RR కెప్టెన్గా రియాన్ పరాగ్!

రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్గా రియాన్ పరాగ్ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఐపీఎల్ సీజన్లోనూ కొన్ని మ్యాచ్లకు అతను కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.


