News March 19, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

image

TG: ఎన్నికల రోడ్‌షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్‌షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Similar News

News November 20, 2025

అనకాపల్లి: డీఈవోలు, ఎంఈవోలు ఫిర్యాదుల స్వీకరణకు ఆదేవాలు

image

విద్యా సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కరణకు రాష్ట్రంలోని DEOలు, MEOలు ప్రతిరోజూ నిర్నీత సమయం కేటాయించాలని AP స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు ఈనెల 19న ఉత్తర్వులు జారీచేశారని అనకాపల్లి DEO అప్పారావు గురువారం తెలిపారు. DEOలు రోజూ సా.5గం.ల నుంచి 6గం.ల వరకూ, MEOలు సా.4గం.ల నుంచి 5గంంటల వరకు వారి కార్యాలయాల్లో ప్రజలు, పేరెంట్స్, టీచర్స్‌కు అందుబాటులో వుండాలని ఆదేశాలున్నాయన్నారు.

News November 20, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, NOV 24 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

News November 20, 2025

హిందీ Vs మరాఠీ వివాదం.. యువకుడు ఆత్మహత్య

image

హిందీ-మరాఠీ <<15354535>>వివాదం<<>> ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. MHలోని థానేకు చెందిన అర్ణవ్ ములంద్‌లోని కాలేజీకి వెళ్లేందుకు లోకల్ ట్రైన్ ఎక్కాడు. ఈక్రమంలోనే రైలులో హిందీ-మరాఠీపై చర్చ జరిగింది. ఇది కాస్తా గొడవకు దారి తీయడంతో ఐదుగురు యువకుల గ్యాంగ్ అర్ణవ్‌పై దాడి చేసింది. దీంతో అతడు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని అర్ణవ్ తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.