News September 10, 2024

ఎన్నికలు న్యాయంగా జరగలేదు: USలో రాహుల్

image

లోక్‌సభ ఎన్నికలు న్యాయంగా జరిగినట్టు తాను విశ్వసించడం లేదని LoP రాహుల్ గాంధీ అమెరికాలో అన్నారు. ‘BJPకి 240 సీట్లలోపు వచ్చుంటే నేను ఆశ్చర్యపోయేవాడిని. వారికి అర్థబలం చాలా ఎక్కువ. వారు కోరుకున్నట్టే EC పనిచేసింది. తన అజెండాకు తగిన విధంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు మోదీకి అవకాశం దొరికింది. బ్యాంకు ఖాతాలు స్తంభించినా కాంగ్రెస్ పోటీ చేసింది. మోదీ ఆలోచనను నాశనం చేసింది’ అని ఆయన అన్నారు.

Similar News

News January 7, 2026

వైభవ్ మరో సెంచరీ

image

యూత్ క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగిస్తున్నారు. U19 సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో వన్డేలో 63 బంతుల్లో సెంచరీ చేశారు. ఇందులో 8 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్‌లో ఆరోన్(85) కూడా శతకానికి చేరువలో ఉన్నారు.
* మ్యాచ్‌ను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

News January 7, 2026

రాజకీయమే అసలైన ‘లాభసాటి’ వ్యాపారం?

image

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల ఆస్తులు ఆకాశాన్నంటుతున్నాయి. 2024 ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు 2014లో ₹22.59 కోట్లు ఉండగా 2024 నాటికి ₹146.85 కోట్లకు చేరాయి. పార్టీల వారీగా చూస్తే రీ-ఎలెక్ట్ అయిన ఎంపీల సగటు ఆస్తుల పెరుగుదల YSRCP (532%), MIM (488%) అగ్రస్థానంలో ఉన్నాయి. BJP ఎంపీల ఆస్తులు 108%, కాంగ్రెస్ 135%, TDP 177% పెరిగాయి. దీనిపై మీ కామెంట్?

News January 7, 2026

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు గుడ్‌న్యూస్

image

IRCTC ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్ ఓపెనింగ్ డే (60 రోజుల ముందు)లో ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు టికెట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆధార్ లింక్ లేకుంటే సా.4 గంటల తర్వాత మాత్రమే బుక్ చేసుకోగలరు. అయితే, JAN 12 నుంచి వెరిఫైడ్ యూజర్ల బుకింగ్ టైమ్ రాత్రి 12 గంటల వరకు పొడిగించనుంది. దీంతో, నాన్ వెరిఫైడ్ యూజర్లు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేరు.