News November 18, 2024

ఎలక్షన్స్.. రూ.1,082 కోట్ల సొత్తు సీజ్

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీలతోపాటు 14 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరుగుతున్న స్థానాల్లో ఇప్పటివరకు రూ.1,082 కోట్ల విలువైన అక్రమ సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.181కోట్ల నగదు, రూ.119కోట్ల మద్యం, రూ.123కోట్ల మాదక ద్రవ్యాలు, రూ.302కోట్ల ఆభరణాలు, రూ.354కోట్ల గిఫ్ట్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ్టితో ప్రచారం ముగియడంతో పోలింగ్ జరిగే ఈ నెల 20 వరకు పటిష్ఠ నిఘా ఉంచినట్లు పేర్కొంది.

Similar News

News December 1, 2025

నేటి నుంచే పార్లమెంట్ వింటర్ సెషన్స్

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు సెషన్స్ ప్రారంభం కానుండగా, ఇటీవల మరణించిన ఎంపీలకు తొలుత సంతాపం తెలపనున్నారు. తాజా సమావేశాల్లో 14 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు SIRపై ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధం కాగా వాడీవేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

News December 1, 2025

శివుడు ఎలా జన్మించాడో తెలుసా?

image

సృష్టి కార్యంలో భాగంగా విష్ణువు నుదుటి తేజస్సు నుంచి శివుడు ఆవిర్భవించాడని మనం పురాణాల్లో చదువుకున్నాం. అయితే శివుడు స్వయంభూ అని, ఆయన ఎవరి నుంచి జన్మించలేదని, ఆయనే సర్వానికి మూలమని శివ పురాణం పేర్కొంటుంది. శివుడు ధ్యానంలో రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు, ఓ రుద్రాక్ష నుంచి విష్ణుమూర్తి జన్మించాడని చెబుతోంది. ఈ భిన్న కథనాలు అంతిమంగా త్రిమూర్తుల ఏకత్వతత్త్వాన్ని చాటిచెబుతున్నాయి.

News December 1, 2025

గణనీయంగా తగ్గిన HIV-AIDS కేసులు

image

భారత్‌లో 2010-2024 మధ్య HIV- ఎయిడ్స్ కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వార్షిక కొత్త కేసుల నమోదులో 48.7% క్షీణత నమోదైనట్లు తెలిపింది. అలాగే ఎయిడ్స్ సంబంధిత మరణాలు 81.4%, తల్లి నుంచి బిడ్డకు సంక్రమణ సైతం 74.6% తగ్గినట్లు వివరించింది. అటు 2020-21లో 4.13కోట్ల ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2024-25కు ఆ సంఖ్య 6.62కోట్లకు పెంచినట్లు పేర్కొంది.
– నేడు వరల్డ్ ఎయిడ్స్ డే.