News November 18, 2024
ఎలక్షన్స్.. రూ.1,082 కోట్ల సొత్తు సీజ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీలతోపాటు 14 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరుగుతున్న స్థానాల్లో ఇప్పటివరకు రూ.1,082 కోట్ల విలువైన అక్రమ సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.181కోట్ల నగదు, రూ.119కోట్ల మద్యం, రూ.123కోట్ల మాదక ద్రవ్యాలు, రూ.302కోట్ల ఆభరణాలు, రూ.354కోట్ల గిఫ్ట్స్ ఉన్నట్లు తెలిపింది. ఇవాళ్టితో ప్రచారం ముగియడంతో పోలింగ్ జరిగే ఈ నెల 20 వరకు పటిష్ఠ నిఘా ఉంచినట్లు పేర్కొంది.
Similar News
News November 24, 2025
‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 24, 2025
అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.
News November 24, 2025
చీకటి తర్వాత రావి చెట్టు వద్దకు వెళ్లకూడదా?

చీకటి పడ్డాక రావి చెట్టు వద్దకు వెళ్తే దెయ్యాలు, దుష్ట శక్తులు సంచరిస్తాయని పెద్దలు అంటుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే. దీని వెనుక వృక్షశాస్త్ర రహస్యం ఉంది. రాత్రిపూట రావి చెట్టు పెద్ద మొత్తంలో చెడు గాలిని విడుదల చేస్తుంది. దానిని పీల్చడం ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి శాస్త్రీయంగా వివరించలేక దెయ్యాల పేర్లు చెప్పేవారు. అలా జనాలను ఈ చెట్టు వద్దకు వెళ్లకుండా చేసేవారు.


