News August 14, 2025
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP ఘనవిజయం సాధించడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలి’ అని CM ఆదేశించారు.
Similar News
News August 14, 2025
వార్-2 VS కూలీ.. ఏ మూవీకి వెళ్లారు?

NTR, హృతిక్ల ‘వార్-2’, రజినీకాంత్ ‘కూలీ’ సినిమాల బాక్సాఫీస్ ఫైట్ మొదలైంది. భారీ అంచనాల మధ్య ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ రెండు యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఫ్యాన్స్కు మాత్రం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరోల స్క్రీన్ ప్రజెన్స్తో కడుపునిండిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఏ మూవీకి వెళ్లారు? ఎలా అనిపించింది? COMMENT
News August 14, 2025
యువతిపై గ్యాంగ్రేప్.. 10 మంది అరెస్ట్

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.
News August 14, 2025
నటుడు దర్శన్ బెయిల్ రద్దు

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా మరో ఐదుగురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు వారికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. తక్షణమే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా వారికి కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.