News March 16, 2024
స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 1/2
కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.
Similar News
News September 29, 2024
నవంబర్ 26లోపు మహారాష్ట్ర ఎన్నికలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని Nov 26లోపు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నట్టు CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ అయ్యారు. దీపావళి, దేవ్ దీపావళి, ఛట్ పూజ వంటి పర్వదినాలను దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ ప్రకటించాల్సిందిగా పార్టీలు కోరాయి. 288 స్థానాల్లో 9.59 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 19.48 లక్షల మంది మొదటిసారి ఓటు వేయబోతున్నారు.
News September 29, 2024
యూట్యూబర్ మల్లిక్తేజ్పై అత్యాచారం కేసు
TG: యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్తేజ్పై అత్యాచార కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడని ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, తరచూ ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. ఈమేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇటీవల యూట్యూబర్ హర్షసాయిపైనా రేప్ కేసు నమోదైంది.
News September 29, 2024
KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు
TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్పాస్లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్పాస్లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.