News April 18, 2024
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: SC

VVPATలో ఓట్లను క్రాస్ చెక్ చేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల విషయంలో ఎవరికి ఆందోళన కలగకుండా చూడాలని పేర్కొంది.
Similar News
News November 24, 2025
పాలమూరు: మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

నారయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యేపై అని మాగునూరు పోలీసులు ఆయనతోపాటు బీఆర్ఎస్ నేతలు పలువురిపై కేసు నమోదు చేశారు.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


