News March 16, 2024
ఎలక్టోరల్ ట్రస్టులు కూడా బీజేపీకి ఫేవర్గానే! – 1/2

ఎలక్టోరల్ బాండ్స్తో పాటు ఎలక్టోరల్ ట్రస్టుల విరాళాలూ ఎక్కువగా బీజేపీకే అందినట్లు తెలుస్తోంది. 2022-23లో ఐదు ట్రస్టులు పార్టీలకు రూ.366కోట్లు ఇవ్వగా.. వీటిలో రూ.259కోట్లు బీజేపీకే వెళ్లాయి. అత్యధిక బాండ్స్ విరాళమిచ్చిన సంస్థల్లో రెండో స్థానంలో ఉన్న మేఘా ఇంజినీరింగ్ ప్రూడెంట్కు (బీజేపీ మద్దతుదారు) రూ.87కోట్లు ఇచ్చింది. FY17 నుంచి ప్రూడెంట్కు వచ్చిన కార్పొరేట్ డొనేషన్లలో 85% బీజేపీకే వెళ్లాయి.
Similar News
News February 7, 2026
AI కోసం టెక్ దిగ్గజాల ₹58 లక్షల కోట్ల రిస్క్!

AI రేసులో గెలవడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ కంపెనీలు 2026లో ఏకంగా $700 బిలియన్లు (సుమారు ₹58 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 60% ఎక్కువ. డేటా సెంటర్లు, చిప్స్ కోసం చేస్తున్న ఈ భారీ పెట్టుబడులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపరీతమైన ఖర్చుల వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోగా.. కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో తగ్గి అప్పులు పెరుగుతున్నాయి.
News February 7, 2026
APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.
News February 7, 2026
ప్రీ డయాబెటీస్ని ఎలా గుర్తించాలంటే?

ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్కి ముందు స్టేజి. వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు మరీ అధికంగా ఉండవు కానీ కాస్త ఎక్కువగా ఉంటాయి. దీన్ని పట్టించుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధారణంగా వైద్యులు మందులను ఇవ్వరు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాలని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.


