News July 9, 2024
బాబు హయాంలోనే విద్యుత్ రంగం కుప్పకూలింది: కాకాణి

AP: CM చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. బాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలేనని మండిపడ్డారు. ‘శ్వేతపత్రం పేరుతో జగన్ను విమర్శించేందుకు CM ప్రయత్నించారు. బాబు చేయనిది కూడా చేసినట్లు చూపుతున్నారు. ఆయన గత పాలనలోనే విద్యుత్ రంగం రూ.86,215 కోట్ల అప్పుల పాలైంది. జగన్ పాలనలో విద్యుత్ రంగం అభివృద్ధి చెందింది’ అని చెప్పారు.
Similar News
News January 3, 2026
ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 3, 2026
వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది: రాజ్నాథ్

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉన్నత విద్యావంతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. <<18265346>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్ఞానంతోపాటు విలువలు, వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పారు. విద్య ఉద్దేశం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, కార్యక్టర్ను అభివృద్ధి చేసుకోవడమని చెప్పారు.
News January 3, 2026
వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

అంతర్జాతీయ క్రికెట్కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.


