News December 27, 2024
YS జగన్ వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు: అచ్చెన్నాయుడు

AP: వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆరోపించారు. యూనిట్ విద్యుత్ రూ.5కే వస్తున్నా జగన్ రూ.8కి కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపి ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటన్నారు.
Similar News
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్హౌస్లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.
News October 18, 2025
ఈ పండ్లలో అధిక పోషకాలు

*ఆపిల్: ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
*అరటి- పొటాషియం, విటమిన్ B-6 వల్ల శక్తి అందుతుంది.
* జామ: విటమిన్ C, ఫైబర్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
*ఆరెంజ్: విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
*దానిమ్మ, బొప్పాయి, కివీ, ఉసిరిలోనూ పోషకాలుంటాయి.
News October 18, 2025
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడండి: హరీశ్ రావు

TG: BC రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్, BJP గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘కేంద్రంలో BJP, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలు మద్దతిచ్చాక రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా BC రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా BRS మద్దతు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.