News June 12, 2024
ఎల్లుండి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఆయన X(ట్విటర్) ద్వారా వెల్లడించారు. వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కిషన్ రెడ్డి తనపై మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. కాగా ఇవాళ అమిత్ షా, నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి నేతలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 17, 2026
పెరగనున్న టీవీ, ల్యాప్టాప్స్ ధరలు

వచ్చే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ల ధరలు 4-8% పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మెమరీ చిప్స్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. చిప్స్ రేట్లు ఇప్పటికే 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50%, తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్సుంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల ధరలూ పెరగనున్నాయి. ఇప్పటికే గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఈ ఏడాది 30%+ పెరగొచ్చని నథింగ్ CEO అంచనా వేశారు.
News January 17, 2026
ఈ రైతు వ్యవసాయం ప్రత్యేకం.. రోజూ ఆదాయం

15 ఏళ్లుగా సమీకృత సేద్యం చేస్తూ అద్భుత విజయాలు అందుకుంటున్నారు జగిత్యాల(D)మెట్లచిట్టాపూర్కు చెందిన భూమేశ్వర్. 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ.. డెయిరీఫామ్, నాటు కోళ్లు, చేపలను కూడా పెంచుతున్నారు. పాలు, కూరగాయలు, ఆర్గానిక్ రైస్, కోళ్లు, చేపలు అమ్మి రోజూ ఆదాయం పొందుతున్నారు. ఈ రైతు సక్సెస్ స్టోరీ తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.
News January 17, 2026
ఇతిహాసాలు క్విజ్ – 126

ఈరోజు ప్రశ్న: రావణుడు చనిపోతున్నప్పుడు లక్ష్మణుడు అతని దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


