News March 23, 2024

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

TG: హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News July 8, 2024

స్మృతి మంధాన లవర్ ఇతనే..

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానతో రిలేషన్‌ను మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్ఛల్‌ అధికారికంగా ప్రకటించారు. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయని తెలుపుతూ వారిద్దరూ కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు మంధాన లవ్ సింబల్స్‌తో కామెంట్ చేసింది. కాగా స్మృతి, పలాష్ పలుమార్లు కలిసి కనిపించినా తమ బంధంపై ఎప్పుడూ నోరువిప్పలేదు.

News July 8, 2024

జంగా కృష్ణమూర్తికి హైకోర్టులో ఊరట

image

AP: మండలి ఛైర్మన్ తనపై అనర్హత వేటు వేయడాన్ని జంగా కృష్ణమూర్తి హైకోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఛైర్మన్ వ్యవహరించారని ఆయన తరఫు లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

News July 8, 2024

చంద్రబాబును విమర్శిస్తే వదిలిపెట్టం: సోమిరెడ్డి

image

AP: తెలుగు రాష్ట్రాల గత CMలు జగన్, కేసీఆర్.. ప్యాలెస్, ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఇప్పటి CMలు చంద్రబాబు, రేవంత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని తెలిపారు. వీరి భేటీపై మాజీ మంత్రి కాకాణి విమర్శలు సరికాదన్నారు. ఇంకోసారి CBNను విమర్శిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ నియంతలా వ్యవహరించారని, ఆయన పాలన కర్ఫ్యూను తలపించిందని దుయ్యబట్టారు.