News March 21, 2024
ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
Similar News
News January 5, 2026
20% నిల్వలున్నా.. 1% ఉత్పత్తే: వెనిజులాకు ఎందుకీ దుస్థితి?

ప్రపంచ చమురు నిల్వల్లో 20% వాటా ఉన్న వెనిజులా ప్రస్తుతం కేవలం 1% (10 లక్షల బ్యారెళ్లు) మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. 1990ల్లో 35 లక్షలుగా ఉన్న ఈ ఉత్పత్తి.. స్కిల్డ్ వర్కర్ల తొలగింపు, కంపెనీల జాతీయీకరణ, అవినీతి, నిధుల మళ్లింపు, అమెరికా ఆంక్షల వల్ల ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు మదురోను బంధించిన ట్రంప్.. US కంపెనీల పెట్టుబడులతో ఈ భారీ నిల్వలను వెలికితీసి ప్రపంచ చమురు మార్కెట్ను శాసించాలని స్కెచ్ వేశారు.
News January 5, 2026
గేదెలు, ఆవుల్లో ఈ తేడాను గమనించారా?

గేదెల కంటే ఆవులకే తెలివితేటలు ఎక్కువట. ఒక గేదెను 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదిలేస్తే ఇంటికి తిరిగి రాలేదు. దాని జ్ఞాపక శక్తి గోవుతో పోలిస్తే చాలా తక్కువ. అదే ఆవును 10km దూరం తీసుకెళ్లి వదిలేసినా ఇంటిదారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుందట. 10 గేదెలను కట్టి వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్కపిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు. ఆవు దూడలు అలాకాదట, తనతల్లి కొన్ని వందల ఆవుల మధ్యలో ఉన్నా గుర్తిస్తాయట.
News January 5, 2026
ఇతిహాసాలు క్విజ్ – 118 సమాధానం

ప్రశ్న: పాండవులు స్వర్గానికి వెళ్తుండగా ధర్మరాజును చివరి వరకు అనుసరించి, ఆయనతో పాటు స్వర్గం వరకు వెళ్లిన జంతువు ఏది? ఆ జంతువు రూపంలో ఉన్నది ఎవరు?
సమాధానం: ధర్మరాజును చివరి వరకు అనుసరించిన జంతువు కుక్క. నిజానికి ఆ కుక్క రూపంలో ఉన్నది యముడు. తనను నమ్ముకున్న ఆ మూగజీవిని వదిలి స్వర్గానికి రావడానికి ధర్మరాజు నిరాకరిస్తాడు. అతని ధర్మనిష్ఠను, కరుణను పరీక్షించడానికే యముడు ఆ రూపంలో వచ్చాడు. <<-se>>#Ithihasaluquiz<<>>


