News December 11, 2024
ఎల్లుండి స్వర్ణాంధ్ర-2047 విజన్ విడుదల

AP: డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్-2047ను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో ఈ విజన్ రూపొందించామన్నారు. దీని ఆధారంగానే రాష్ట్రంలో పరిపాలన ఉండాలని కలెక్టర్ల సమావేశంలో సీఎం వెల్లడించారు. 15శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందని సీఎం వెల్లడించారు.
Similar News
News September 20, 2025
ఇక గ్రీన్ కార్డు కష్టమే గురూ..!

అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ట్రంప్ షాక్ ఇచ్చారు. గ్రీన్ కార్డు రావాలంటే EB-3 క్యాటగిరీలోని స్కిల్డ్ వర్కర్లు, ప్రొఫెషనల్స్ 12 నుంచి 40 ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా H1B వీసాల అప్లికేషన్ ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.88 లక్షలు చెల్లిస్తూ ఉంటేనే వీసా రెన్యూవల్ అయి గ్రీన్ కార్డు వస్తుంది.
News September 20, 2025
వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరికీ మద్దతు ధర(దూది పింజ పత్తికి క్వింటాకు ₹8,110, తక్కువ దూది పింజ ఉంటే ₹7,710) లభించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ఫ్రీ నంబర్ 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించాలన్నారు.
News September 20, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరిగి రూ.1,12,150కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.750 ఎగబాకి రూ.1,02,800 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,45,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.