News June 2, 2024
ఎల్లుండి వైన్ షాపులు బంద్

TG: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 4న ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు.
Similar News
News October 27, 2025
పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>
News October 27, 2025
సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News October 27, 2025
పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.


