News June 2, 2024

ఎల్లుండి వైన్ షాపులు బంద్

image

TG: ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 4న ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు.

Similar News

News December 27, 2025

ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

1. బియ్యం: పాపాలు తొలుగుతాయి.
2. ప౦డ్లు:బుద్ధి, సిద్ధి కలుగుతాయి.
3. పెరుగు:ఇ౦ద్రియ నిగ్రహ౦ కలుగుతుంది.
4. నెయ్యి:రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
5. పాలు:నిద్ర లేమి సమస్య ఉండదు.
6. తేనె: స౦తానం కలుగుతుంది.
7. ఊసిరికాయలు: జ్ఞాపకశక్తి పెరుగుతు౦ది.
8. టె౦కాయ: అనుకున్న కార్య౦ సిద్ధిస్తు౦ది.
9. దీపదానం: క౦టి చూపు మెరుగు పడుతుంది.
10. వస్త్రదానం: ఆయుష్షు
11. అన్న దానం: ధనవృద్ధి పెరుగుతుంది.

News December 27, 2025

అగర్‌బత్తుల్లో ఆ కెమికల్స్‌పై బ్యాన్

image

ప్రపంచంలో అగర్‌బత్తుల అతిపెద్ద ఉత్పత్తిదారు, ఎగుమతిదారైన భారత్ వినియోగదారుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. BIS (Bureau of Indian Standards) ‘IS 19412:2025’ అనే కొత్త ప్రమాణాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం అగర్‌బత్తుల తయారీలో హానికరమైన అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ వంటి క్రిమిసంహారకాలు, కొన్ని సింథటిక్ సువాసన రసాయనాల వినియోగాన్ని నిషేధించింది.

News December 27, 2025

ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

image

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.