News September 16, 2024
వివాదాస్పద ట్వీట్పై స్పందించిన ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని చేసిన వివాదాస్పద ట్వీట్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ‘నేను దీన్నుంచి నేర్చుకుందేమిటంటే? నేనేదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు ప్రజలు నవ్వుతారు. దానర్థం అది Xలో పోస్ట్ చేస్తే అంతే ఫన్నీగా ఉంటుందని కాదు’ అని రాసుకొచ్చారు. ట్రంప్నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్ అడగ్గా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News January 4, 2026
మేడారం జాతర.. టోల్ ‘ఫ్రీ’ పరిశీలిస్తున్నామన్న కోమటిరెడ్డి

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఊరటనిచ్చేలా టోల్ ఫీజు మినహాయింపును ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ‘సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వారికే కాదు, తెలంగాణ గడ్డపై జరిగే అతిపెద్ద జాతర మేడారానికి వెళ్లే భక్తుల కోసం కూడా టోల్ ఫీజు మినహాయింపుపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.
News January 4, 2026
ఫైరింగ్ నేర్చుకుని భార్యను కాల్చి చంపిన టెకీ

బెంగళూరులోని బసవేశ్వరలో గతనెల 24న జరిగిన బ్యాంకు మహిళా ఉద్యోగి హత్యకేసులో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భార్య భువనేశ్వరిని చంపమని భర్త బాలమురుగన్ మొదట TNకు చెందిన వ్యక్తికి రూ.1.25లక్షలు సుపారీ ఇచ్చాడు. అతను చంపలేదని స్వయంగా తానే చంపేయాలని ఫిక్స్ అయ్యాడు. బిహార్ వెళ్లి రూ.50 వేలకు గన్ కొన్నాడు. అక్కడే 15 రోజులు గన్ కాల్చడం నేర్చుకున్నాడు. తిరిగి వచ్చి నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపేశాడు.
News January 4, 2026
ఫోర్బ్స్ ’40 అండర్ 40’లో ఏకైక భారతీయుడు

ప్రపంచ వ్యాప్తంగా యువ బిలియనీర్లను గుర్తించే ఫోర్బ్స్ ‘40 అండర్ 40’లో ఈసారి నలుగురు భారత సంతతి వ్యాపారవేత్తలకు చోటు లభించింది. ఇందులో భారత్ నుంచి ఏకైక బిలియనీర్గా జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ నిలిచారు. 39 ఏళ్ల నిఖిల్ నెట్వర్త్ $3.3Bగా ఉంది. ఈ లిస్ట్లో AI స్టార్టప్ మెర్కోర్ను స్థాపించిన ఆదర్శ్ హిరేమత్, సూర్య మిద్దా కూడా ఉన్నారు. ఈ జాబితాలో వీళ్లే అతి చిన్న వయస్కులైన (22 ఏళ్లు) బిలియనీర్లు.


