News March 18, 2024
ఏలూరు: నర్సుతో LOVE.. గర్భవతిని చేసి మోసం

ఏలూరు జిల్లాలో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదైంది. వివరాలు.. ఏలూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నూజివీడుకు చెందిన పురమా సాయిబాబు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె అతడికి దగ్గరైంది. ఈ క్రమంలోనే గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ చేయించి.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. యువతి ఫిర్యాదుమేరకు కేసు నమోదైంది.
Similar News
News January 26, 2026
ప.గో: జిల్లాలో పెరిగిన మార్కెట్ విలువలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026వ సంవత్సర మార్కెట్ విలువలను పెంచుతూ ఉత్తర్వలు జారీచేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 0 నుంచి 25% వరకు మార్కెట్ విలువలు పెరిగాయని జిల్లాలోని 15 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నారు.
News January 26, 2026
ఏలూరు జిల్లాలో 595 మందికి అవార్డులు

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
News January 26, 2026
ఏలూరు జిల్లాలో 595 మందికి అవార్డులు

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.


