News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

Similar News

News October 11, 2025

కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే?

image

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. అలాగే.. విజయవాడ కనక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే యుగాంతమే అని కూడా చెప్పారు. ‘అంత ఎత్తయిన కొండపైకి కృష్ణా నీరు రావడమంటే, అది ప్రకృతి ప్రకోపానికి, ప్రళయానికి సంకేతం. ఆ పెను మార్పు సంభవించినప్పుడు లోకంలో జీవరాశి నిలవడం కష్టం. ఇది యుగాంతానికి దారి తీసే భయంకరమైన దైవిక సంకేతం’ అని పండితులు చెబుతున్నారు.

News October 11, 2025

ముత్తాఖీ ప్రెస్‌మీట్‌.. ఉమెన్ జర్నలిస్టులకు నో ఇన్విటేషన్

image

ఇవాళ భారత పర్యటనకు వచ్చిన అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ మంత్రి జైశంకర్‌తో భేటీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఇంకా లింగ వివక్ష చూపుతోందని భారత మహిళా జర్నలిస్టులు మండిపడుతున్నారు. పురుష జర్నలిస్టులు ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేసి నిరసన తెలపాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీనిపై మీరేమంటారు?

News October 11, 2025

రాజధాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలును విడుదల చేసింది. 495 మందికి అందాల్సిన రూ.6.6కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. బ్యాంకు లింకేజీ సమస్యలతో పాటు పలు కారణాలతో జమ కాని వారికి 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి కౌలు సొమ్ము జమ చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.